వాతావరణం చాలా మారిపోతోంది.ప్రతియేటా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ముఖ్యంగా వేసవి కాలం అధిక తాపంతో ప్రజలను ఏపుకు తింటోంది.పట్ణణ ప్రజలైనా, పల్లెవాసులైనా ఇపుడు తమ ఇళ్లల్లో ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు.
అయితే ఏసీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు బోలెడంత కరెంట్ బిల్లు కూడా వస్తుంది.ఇక ఈ ఏసీ అనేది నేడు మనం కేవలం క్లోజ్డ్ సర్ఫేస్లో మాత్రమే ఏర్పాటుచేసుకొనే వెసులుబాటు కలదు.
ఆరుబయట, ఇలాంటివి ఏర్పాటుచేసుకొనే అవకాశం దాదాపుగా లేదనే చెప్పుకోవాలి.
అయితే ఇపుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ కి చెక్ పెడుతూ ఓ వార్త వైరల్ అవుతోంది.అవును… అసలు విద్యుత్ అవసరమే లేకుండా, ఆరుబయట ఏసీ పెట్టుకుని కూల్గా వాతావరణాన్ని మార్చవచ్చు.ఈ మేరకు ఇజ్రాయెల్ కంపెనీ ‘గ్రీన్ కినోకో’.‘కెన్షో’ పేరుతో ఓ వినూత్న ఏసీని డెవలప్ చేసింది.లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీలోని ప్రామాణిక ట్యాంకులు ద్రవ నత్రజనిని 196 °C (-321 °F) వద్ద ఫ్రీజ్ చేసి, ఏసీని ఆన్ చేయగానే ద్రవం నెమ్మదిగా కూలర్లలోకి లోడ్ అవుతుంది.
అప్పుడది వాయువుగా మారిన క్షణంలో దాదాపు 700 రెట్లు వేగంగా విస్తరిస్తుంది.

కూలర్లు ఆ ద్రవపరిమాణాన్ని 10 °C (14 °F) ఉష్ణోగ్రతతో బయటకు పంపడంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది.ఔట్డోర్ హీటర్తో సమానమైన మోడల్లో పనిచేసే AC యూనిట్లకు ప్రత్యామ్నాయంగా వీటిని రూపొందించగా.బయట ఉన్న వేడి, పరిసరాల ఆధారంగా లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులను ప్రతీ 7-10 రోజులకు మార్చవలసి ఉంటుంది.
కాగా పైలట్ ట్రయల్స్ కోసం కంపెనీ 12 నమూనా యూనిట్లను నిర్మించింది.ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.కానీ 2023 చివరి వరకు మార్కెట్లోకి విడుదల చేస్తాం.మా ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు పెట్టుబడి కోసం చూస్తున్నాము.







