ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఎన్నో ఏళ్లుగా తమ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం సాగిస్తున్న హీరోయిన్ లు ఇన్నాళ్లకు వారి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లిబంధంతో ఒక్కటి అవుతున్నారు.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మరొక స్టార్ హీరోయిన్ సైతం పెళ్ళికి సిద్ధం అవుతుంది అని రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న హీరోయిన్ లలో కియారా అద్వానీ ఒకరు.
ఇక ఈ బ్యూటీ సిద్ధార్థ్ మల్హోత్రా తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం అందరికి తెలుసు.గురించి బాలీవుడ్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటూ డిబేట్ లు సైతం పెట్టుకుంటున్నారు.
ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అంటూ అక్కడి మీడియా కథనాలు ప్రచురిస్తుంది.
అయితే కియారా మాత్రం ఇప్పటి వరకు తమ ప్రేమ గురించి ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు.
ఇంతకు ముందు కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ ఒక హింట్ ఇచ్చాడు.మేము మంచి స్థానంలో ఉంటామని చెప్పుకొచ్చాడు.
తాజాగా కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7లో కియారా, షాహిద్ కపూర్ పాల్గొన్నారు.ఈ లేటెస్ట్ ఎపిసోడ్ నుండి కొత్త ప్రోమో వచ్చింది.

ఇందులో షాహిద్ కపూర్ ఈ ఏడాది చివరిలో కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.దీంతో వీరి పెళ్లి గురించిన చర్చ మరోసారి జరుగుతుంది.మరి ఈ జంట ఆఫ్ స్క్రీన్ లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.మరి రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుని బెస్ట్ కపుల్ అని అనిపించు కుంటారో లేదో చూడాలి.
ఇక ప్రెజెంట్ కియారా తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్సీ 15 సినిమాలో నటిస్తుంది.శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అంతే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







