మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందాడు.ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు.
ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.
ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు.
ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన దగ్గర నుండి శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది.
అయితే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.
మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అయినా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూసారు.కానీ అప్పుడు కూడా ఎలాంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వలేదు.

ఇక ఈ రోజు అయినా ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.మరి అంతగా ఈ రోజు అప్డేట్ ఇవ్వడానికి స్పెషల్ ఏంటంటే.ఈ రోజు జేమ్స్ క్యామెరున్ శంకర్ పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.దీంతో ఈయనకు బర్త్ డే విషెష్ చెబుతూ ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఫ్యాన్స్ కోరిక ఈ రోజు అయినా తీరుతుందో లేదో చూడాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.







