మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కేసు విచారణ ధర్మాసనం పర్యవేక్షణలో జరగాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు.
నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారన్నారు.ఈ కారణంగానే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ సాగించాలని ఆమె కోరుతూ పిల్ దాఖలు చేశారు.