తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర-సెలవు దొర అంటూ పోస్టర్లు ముద్రించడానికి అనుమతి నిరాకరించింది.
రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు ఉండరాదని ఈసీ తెలిపింది.ఈ క్రమంలోనే సాలు దొర -సెలవు దొర ప్రకటనలపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.
సాలు దొర -సెలవు దొర క్యాంపెయిన్ కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేసుకుంది.ఈ నేపథ్యంలో బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
అయితే, కొద్ది రోజుల క్రితం బీజేపీ కార్యాలయం వెలుపల కొన్ని పోస్టర్లు వెలిశాయి.తెలంగాణ సర్కార్ తీరును నిరసిస్తూ ఈ ప్రకటన వైరల్ గా మారింది.