తెలంగాణ బీజేపీకి సీఈసీ ఝ‌ల‌క్..

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షాక్ ఇచ్చింది.కేసీఆర్ కు వ్య‌తిరేకంగా సాలు దొర‌-సెల‌వు దొర అంటూ పోస్ట‌ర్లు ముద్రించ‌డానికి అనుమ‌తి నిరాక‌రించింది.

రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను కించ‌ప‌రిచే విధంగా పోస్ట‌ర్లు, ఫొటోలు ఉండ‌రాద‌ని ఈసీ తెలిపింది.

ఈ క్ర‌మంలోనే సాలు దొర -సెల‌వు దొర ప్ర‌క‌ట‌న‌ల‌పై నిషేధం విధించిన‌ట్లు వెల్ల‌డించింది.

సాలు దొర -సెల‌వు దొర క్యాంపెయిన్ కు అనుమ‌తి కోరుతూ మీడియా స‌ర్టిఫికేష‌న్ క‌మిటీకి బీజేపీ ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తోసిపుచ్చింది.అయితే, కొద్ది రోజుల క్రితం బీజేపీ కార్యాల‌యం వెలుప‌ల కొన్ని పోస్ట‌ర్లు వెలిశాయి.

తెలంగాణ స‌ర్కార్ తీరును నిర‌సిస్తూ ఈ ప్ర‌క‌ట‌న వైర‌ల్ గా మారింది.

రాజమౌళికి ఆ సెలబ్రిటీలు అంటే అంత కోపమా.. ఎవరు.. ఎందుకంటే?