మునుగోడు ఉపఎన్నిక రానుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.బైపోల్ పై అధికార, ప్రతిపక్ష పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.
ఈ క్రమంలోనే మునుగోడుపై దృష్టి సారించిన అధికార టీఆర్ఎస్ ఈనెల 19న భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో ఉంది.
కాగా, ఈ సభకు సీఎం కేసీఆర్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
ఇప్పటికే బీజేపీ ఈనెల 21న సభ నిర్వహించనుండగా.దానికంటే ముందే టీఆర్ఎస్ సభ పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.