బిగ్ బాస్ కార్యక్రమానికి షాక్ ఇచ్చిన దుర్గారావు... ఒంటరిగా వెళ్ళనంటూ?

బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి క్రేజ్ దక్కించుకుంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుని ఆరవ సీజన్ ప్రసారం అవ్వడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని, త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోందని వార్త వస్తున్నాయి.ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిని ఎంపిక చేశారని సమాచారం.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా టిక్ టాక్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దుర్గారావు ఈ సీజన్లోకి వెళుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.దాదాపు ఈ కార్యక్రమంలోకి దుర్గారావు కన్ఫర్మ్ అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దుర్గారావు బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకులకు బిగ్ షాక్ ఇచ్చారని సమాచారం.

తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూనే ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి ఒంటరిగా వెళ్లనని షాక్ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

దుర్గారావు ఎక్కడికి వెళ్లినా, ఏ కార్యక్రమం చేసిన తప్పనిసరిగా తన భార్యతో కలిసి చేస్తారు.ఇప్పటివరకు దుర్గారావు ఒంటరిగా ఎక్కడ సందడి చేయలేదు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా తాను ఒంటరిగా వెళ్లనని తన భార్య కూడా రావాలని పట్టుబడుతున్నారట.

అయితే తన భార్య వచ్చినందుకు తనకు అధిక పారితోషకం అవసరం లేదని కేవలం తన భార్యను మాత్రమే బిగ్ బాస్ కార్యక్రమంలోకి పంపిస్తే చాలని మేమిద్దరం ఎంటర్టైన్ చేయడమే కాకుండా తనకు ఎంతో ధైర్యంగా ఉంటుందని టిక్ టాక్ దుర్గారావు బిగ్ బాస్ నిర్వహణ వేడుకున్నట్లు తెలుస్తోంది.మరి టిక్ టాక్ దుర్గారావు గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు