అమరావతి: రోడ్ల మరమ్మతులు, నిర్మాణం పై ముగిసిన సీఎం వైఎస్ జగన్ సమీక్ష.పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్.
రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్ ఒబీలను వేగంగా నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారు.రోడ్ల మరమ్మతులు, నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికగా నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పురపాలక శాఖ పరిధిలోని 4 వేల పైచిలుకు కి.మీ జూలై 15 లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశింతారు.రాష్ట్రంలో 27వేల కి.మీ పైగా పంచాయతీరోడ్లు శాచురేషన్ పద్దతిలో అభివృద్ది చేయాలని సీఎం ఆదేశించారు.జూలై 20లోపు మరమ్మతులు, నిర్మాణం పూర్తి చేసి నాడు నేడు కింద ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు.గిరిజన ప్రాంతాల్లో హాబిట్ విలేజీలకు 5వేలు కిమీ రోడ్లు పూర్తి చేశాం.
గిరిజన ప్రాంతాల్లో మిగిలిన 3వేల కిలోమీటర్ల అన్ కనెక్టెడ్ హాబిట్ విలేజిలరోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు.రోడ్ల నిర్మాణాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ఆదేశించారు.
నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా బైజూస్ పేరొందింది.నాణ్యమైన విద్యను ఉచితంగా ప్రభుత్వ పాఠశాల్లోని పేద పిల్లలకు అందించేందుకు బైజూస్ ముందుకు వచ్చింది.
బైజూస్ ను జగన్ జూస్ అని చంద్రబాబు వెటకారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు.
సాంకేతికతను అందరికీ అంగించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారు.బైజూస్ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే ఏర్పాట్లు చేశారు.
ఏటా 8తరగతి విద్యార్థులకు 500 కోట్లతో ప్రభుత్వం ట్యాబ్ లు అందిస్తుంది.ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తుంటే చంద్రబాబు అవాకులు, చవాకులు పేల్చడం శోచనీయం.
బైజూస్ అనేది రాష్ట్రంలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది.ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బైజూస్ అనేది గొప్ప అవకాశం.







