బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా అక్షయ్ కుమార్ మంచి గుర్తింపు పొందాడు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటాడు.
అందరి నటీ, నటులలాగే అక్షయ్ కుమార్ కూడా కమర్షియల్ యాడ్స్ లో నటించి అధిక మొత్తంలో సంపాదిస్తున్నాడు.అయితే ఇటీవల షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ కలిసి ఒక పొగాకు సంబంధిన యాడ్ లో నటించారు.
అక్షయ్ కుమార్ ఈ యాడ్ లో నటించడంతో అతని అభిమానులు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు.
గత కొంతకాలంగా అభిమానుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ఇటీవల ఈ విషయం గురించి మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా అభిమానుల నుండి వస్తున్న వ్యతిరేక స్పందన తనను ఎంతగానో బాధ పెట్టిందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశాడు.ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ కలసి నటించిన పొగాకు సంబంధించిన యాడ్ ఒకటి ప్రసారమవుతుంది.తమ అభిమాన హీరో ఇలా యువత భవిష్యత్తును తప్పు దారి పట్టేలా ఇలాంటి ప్రకటనలలో నటించటం వల్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.
ఆ ప్రకటన నుండి తప్పుకోవాలని సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ని కోరారు.








