ఢిల్లీ పర్యటనకు రెడీ అయిన కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు.ఏకంగా పది రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.

 Kcr Ready For Delhi Tour Kcr, Delhi, Ts Poltics , Bjp Party , Modi , Formmers ,-TeluguStop.com

గత కొద్ది నెలల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై కేసీఆర్ తనదైన శైలిలో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో పార్లమెంటులో బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత.

తెలంగాణ కేటాయింపులు ఇంకా అనేక విషయాలకు సంబంధించి.మీడియా సమావేశం పెట్టి బీజేపీని కెసిఆర్ కడిగిపారేశారు.

దేశంలో మార్పు రావాలని.తెలియజేస్తూ బిజెపికి వ్యతిరేకంగా ఉండే ప్రతి అవకాశాన్ని కెసిఆర్ వాడుకుంటున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా లఖింపూర్ కేరి బాధిత కుటుంబాలను తాజా పర్యటనలో పరామర్శించనున్నారు.అప్పట్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన రైతుల పై కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు వాహనంతో ఢీకొట్టడం పలువురు రైతులు మరియు జర్నలిస్టు మరణించటం సంచలనం రేపింది.

ఈ ప్రమాదం సంభవించిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆ తర్వాత ఆర్థిక వేత్తలు మరియు రైతు సంఘాల ప్రతినిధులను తాజా పర్యటనలో కెసిఆర్ కలవనున్నట్లు సమాచారం.అనంతరం మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో.మరికొంతమంది రాజకీయ నాయకులతో.  మేధావులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube