పుష్ప సినిమాకి దక్కిన అరుదైన గౌరవం...ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.

ఈ సినిమా 5 భాషలలో విడుదల అయ్యి సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

ఇలా ఈ సినిమాలోని డైలాగులు పాటలు రికార్డులు సృష్టించడమే కాకుండా తాజాగా ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కిందని చెప్పాలి.పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా ఏకంగా దాదా సాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్​ 2022 అవార్డుకు ఎంపికయింది.

ఈ క్రమంలోని ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా అధికారకంగా తెలియ జేశారు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై రికార్డు సృష్టించగా తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపిక కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా అల్లుఅర్జున్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.పుష్ప ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం పుష్ప పార్ట్ 2 పై మరింత శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2 త్వరలోనే చిత్రీకరణ పనులను ప్రారంభించి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావించారు.మొత్తానికి అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లోముచ్చటగా మూడోసారి తెరకెక్కిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపిక కావడంతో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అలాగే అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు