క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.
ఈ సినిమా 5 భాషలలో విడుదల అయ్యి సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇలా ఈ సినిమాలోని డైలాగులు పాటలు రికార్డులు సృష్టించడమే కాకుండా తాజాగా ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కిందని చెప్పాలి.పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా ఏకంగా దాదా సాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికయింది.
ఈ క్రమంలోని ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా అధికారకంగా తెలియ జేశారు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై రికార్డు సృష్టించగా తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపిక కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా అల్లుఅర్జున్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.పుష్ప ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం పుష్ప పార్ట్ 2 పై మరింత శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2 త్వరలోనే చిత్రీకరణ పనులను ప్రారంభించి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావించారు.మొత్తానికి అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లోముచ్చటగా మూడోసారి తెరకెక్కిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపిక కావడంతో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అలాగే అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy