నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రం థియేటర్లో విడుదల చేయాలని ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఈసినిమా ఓటీటీలో విడుదలయి తీవ్ర నిరాశను కలిగించింది.ఈ క్రమంలోనే నాని తన తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ పై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే నాని సాయి పల్లవి కృతి శెట్టి ప్రధానపాత్రలో బెంగాలీ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను మెప్పించారు ఇక నేచురల్ బ్యూటీ సాయిపల్లవి దేవదాసీ పాత్ర ద్వారా సందడి చేశారు.ఈ విధంగా ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల అవుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఇక థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ప్రతి సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా థియేటర్లో ఏ విధమైనటువంటి ఆదరణ దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్ లో కూడా అదే ఆదరణ దక్కించుకుందని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అత్యధిక వ్యూయింగ్ అవర్స్ దక్కించుకొని భారతదేశంలో ఏ సినిమాకు దక్కని అరుదైన రికార్డును నాని సినిమా దక్కించుకోవడం విశేషం.ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న మూడు రోజుల వ్యవధిలోనే ఏకంగా 3.6 వ్యూయింగ్ అవర్స్ దక్కించుకొని సరికొత్త రికార్డును సృష్టించింది.ఇక ఈ వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినా వాటిలో నాని శ్యామ్ సింగరాయ్ చిత్రం టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఇకపోతే ఇప్పటి వరకు ఏ ఒక్క సౌత్ సినిమా కూడా ఇలాంటి ఘనతను దక్కించుకోలేదని చెప్పాలి.ఇక ఈ సినిమా థియేటర్లోను,ఓటీటీలోనూ ఓకే విజయాన్ని అందుకోవడం విశేషం.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లను దారుణంగా తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణాకొట్టు కలెక్షన్లు అధికంగా ఉన్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.
ఇక నాని చేసిన ఈ వ్యాఖ్యలు అతని సినిమాపై ప్రభావం చూపిస్తాయని చాలామంది భావించినప్పటికీ ఈ సినిమా మాత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇలా సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తూ దూసుకుపోవడం విశేషం.