చచ్చిపోయా.. అంటూ చిన్నారి పాటకు స్పందించిన సమంత!

విడాకుల తర్వాత సమంత పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ద్వారా మొట్ట మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.పుష్ప సినిమాల్లోని ఉ అంటావా మామ.

ఊ.ఊ అంటావా అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చంద్రమతి చౌహన్ హస్కీ వాయిస్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఎక్కడ చూసినా ఇదే పాటే వినబడుతోంది.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఒక చిన్నారి డబ్ల్యు హెచ్వో అని తన తల్లి చెప్పగా అందుకు ఆ చిన్నారి ఉ అంటావా మామ.అంటూ ముద్దు ముద్దుగా పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాజాగా ఈ వీడియో పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సమంతా స్పందించారు.

Advertisement

ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ ఈ వీడియోని షేర్ చేస్తూ పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ చేశారు.అయితే తాజాగా ఈ చిన్నారి పాడిన ఈ పాటను చూసిన సమంత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ డెడ్ అంటూ 3 హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఇకపోతే ఐటమ్ సాంగ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఇదే కాకుండా మరికొన్ని సినిమాల లోనూ వెబ్ సిరీస్ లలోనూ నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు