వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ ..

తిరుపతి: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగు ఫిలిమ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

 బుధవారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నారు.

బలిసి కొట్టు కుంటోంది మీరే’’ అంటూ వ్యాఖ్యానించారు.నల్లపు రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడారని, ఇది ఆయనకే వర్తిస్తుందని అన్నారు.ఇక్కడ ఎవరూ బలిసి కొట్టుకోవడంలేదన్నారు.

సినిమాలో నటించాలంటే వంద అడుగుల రోప్ కట్టుకుని, రోప్‌పైకి ఎక్కి వంద అడుగులు దూకితే.ఎవరు బలసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందన్నారు.

Advertisement

 సినిమా నిర్మాణం ఎంత కష్టమో తెలియాలంటే తన సినిమా నిర్మాణం దగ్గరకు ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చి చూడాలని పిలుపునిచ్చారు.తాము కూడా నల్లపురెడ్డిపై మాట్లాడగలమని అన్నారు.

తమకు సంస్కారం ఉందని, మీడియా ముందు మాట్లాడితే హీరోలు అయిపోరన్నారు.నల్లపురెడ్డి రాజకీయ జీవితం ఏంటో కొవూరులో అందరికీ తెలిసిందేనని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు