సిగ్గు లేదా మీకు అంటూ ఆ నటిని తిట్టిన సీనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలల్లో  ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి.ఈ సినిమాల్లో  కొన్ని సినిమాలు కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.

తన సినిమాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు.సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఒకే కుటుంబం, బంగారు మనిషి సినిమాలలో లక్ష్మీ నటించారు.

ఆహారాన్ని ఎవరైనా వృథా చేస్తే సీనియర్ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చదు.అయితే ఒకరోజు నటి లక్ష్మి దోసెలు  సగం తిని వెళ్లిపోతుండగా రామారావు గారు ఆమె ఆహారాన్ని వృథా చేయడం చూసి "ఏవండీ లక్ష్మిగారూ.

ఇటు రండి" అని పిలిచారు.సీనియర్ ఎన్టీఆర్ వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ గౌరవంగా పిలిచేవారు.

Advertisement

పేరు పెట్టి పిలవడం సీనియర్ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చేది కాదు.ఆ తర్వాత ఎన్టీఆర్ లక్ష్మితో ఏ ఆహారం తీసుకున్నా జీర్ణించుకునే శక్తి ఉన్న వయస్సు మీదని అలాంటి వయస్సులో సగం దోసె తింటారా? అంటూ సీరియస్ అయ్యారు.సిగ్గు లేదా మీకు? అంటూ రామారావు లక్ష్మిని తిట్టగా లక్ష్మి ఎన్టీఆర్ తో మర్యాదగా పిలిచి తిడుతున్నారని అన్నారు.

ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మీరు చిన్నపిల్లలని బాగా తినాలని రోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సీనియర్ ఎన్టీఆర్ సూచనలు చేశారు.స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని సీనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఈ విధంగా ఎవరైనా తప్పు చేస్తే సీనియర్ ఎన్టీఆర్ సున్నితంగా మందలించేవారు.

సీనియర్ ఎన్టీఆర్ తను తినే ఆహారాన్ని ఎప్పుడూ ఇంటినుంచే తెప్పించుకొని తినేవారు.;పూరీలు , దోసెలు, హల్వా, కారప్పూస, యాపిల్ జ్యూస్ సీసాలు ఆయన ఆహారంలో ఉండేవి.తీసుకునే ఆహారం విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు