తులసికి నీటితో పాటు వీటిని సమర్పిస్తే అంతా శుభమే!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు.

కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

ఈ క్రమంలోనే తులసి మొక్కప్రతి ఇంటి ఆవరణంలో ఉంటూ విశేషమైన పూజలను అందుకుంటుంది.ఇలా తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావించి ప్రతి రోజు దీపారాధన చేస్తూ పూజలు చేస్తుంటారు.

అలాగే ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి పూజలు చేయడం ఆనవాయితి.అయితే చాలా మంది కొన్ని సందర్భాలలో ఇంట్లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు.

ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయట పడటం కోసం కొన్ని రకాల వాస్తు పరిహారాలను చేస్తుంటారు.ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.

Advertisement

ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమత మయ్యే వారు ప్రతి గురువారం తులసి మొక్కకు నీళ్లతో పాటు ఆవు పాలను కూడా పోయాలి.ఇలా తులసి మొక్కకు నీళ్ళతో పాటు ప్రతి గురువారం ఆవు పాలు పోయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

ఇలా ఈ వాస్తు పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడి ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఎంతో పవిత్రమైన తులసి మొక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే పొరపాటున కూడా తులసి మొక్కకు సాయంత్రం నీళ్లు పోసి పూజ చేయకూడదు .

కేవలం ఉదయం మాత్రమే నీళ్లు పోసి పూజ చేయాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు