సముద్రంలో 12 నిముషాలు.. రాధే శ్యామ్ హైలెట్ అదే..!

ప్రభాస్ రాధే శ్యాం సినిమా నుండి ప్రతి ఒక్క అప్డేట్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా వచ్చిన రెండు సాంగ్స్ ఫ్యాన్స్ ను మెప్పించాయి.

ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ గా మరో న్యూస్ బయటకు వచ్చింది.సినిమాలో సముద్రంలో ఒక సీన్ అదిరిపోతుందని తెలుస్తుంది.12 నిమిషాల పాటు వచ్చే ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్.ప్రేరణగా పూజా హెగ్దే ఇద్దరి జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

పీరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో చాలా సర్ ప్రైజులు ఉన్నట్టు తెలుస్తుంది.సినిమాను 2022 జనవరి 14న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Advertisement

అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా జనవరి 7న రిలీజ్ అవుతుండగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడేలా ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు