ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుంది.కానీ అందరూ తమ చేదు అనుభవాలను పంచుకోవడానికి ఇష్టపడరు.
కొందరు మాత్రం తమ బాధలు చెప్పుకుంటూ బాగా బాధ పడుతుంటారు.అలా ఇప్పటికి ఎంతో మంది ప్రజలు తమ బాధలను ఇతరులకు చెప్పుకొని తమ బాధను షేర్ చేసుకుంటారు.
ఇక ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా తమ వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంటారు.
ఇక సెలబ్రెటీలు చాలావరకు ఏవైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు లేదా ఏవైనా షో లో పాల్గొన్నప్పుడు తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకుంటూ బాగా ఎమోషనల్ అవుతుంటారు.
అలా ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రెటీలు తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ లేడీ కమెడియన్ కూడా తన చిన్నప్పుడు జరిగిన ఓ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.
త్వరలో జీ తెలుగులో సూపర్ క్వీన్ అనే షో ప్రారంభం కానుంది.ఈ షోలో యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్నాడు.
దీంతో ఈ షో కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.అందులో వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొని బాగా సందడి చేసినట్లు కనిపించింది.
ఈ షోలో మొత్తం పదిమంది సెలబ్రిటీ క్వీన్స్ పాల్గొని చివరికి ప్రైజ్ మనీ గెలుచుకోవాల్సి ఉంటుంది.
అలా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు.ఇక లేడీ కమెడియన్ స్నిగ్ధ కూడా పాల్గొన్నది.ఈమె చూడటానికి అచ్చం అబ్బాయిలాగా కనిపిస్తుంది.
తను నటించిన సినిమాల్లో కూడా అబ్బాయి లాగానే నటించేది.నందినీరెడ్డి దర్శకత్వంలో 2011 లో తెరకెక్కిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, దమ్ము, టైగర్, కల్యాణ వైభోగమే వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు బుల్లితెర షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా రచ్చ చేస్తుంది.ఇక ఈమె కూడా సూపర్ క్వీన్ షోలో పార్టిసిపెంట్ చేయనుంది.దీంతో తను స్టేజిపైకి వచ్చి బాగా ఎమోషనల్ అయ్యింది.
తనతో పాటు తన తండ్రి కూడా ఈ షోకు వచ్చాడు.ఇక తన తండ్రి కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది.చిన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తుంటే రానివ్వదు అని జాగ్రత్తలు చెబుతుంటారు అంటూ స్కూల్ కి వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తలు చెబుతారు కదా అని తన తండ్రి కూడా అలా చెప్పేవారు అంటూ తెలిపింది.
ఇక తను చిన్నప్పుడు ఇందిరా పార్క్ లో ఆడుకోడానికి వెళ్ళినప్పుడు ఒకడు పక్కకు లాక్కెళ్ళిపోయాడు అంటూ బాగా ఏడ్చింది.
స్నిగ్ధ మాటలకు అక్కడున్న వాళ్లంతా బాగా ఎమోషనల్ అయ్యారు.ఇలా ఒక్కొక్కరు తమకు జరిగిన ఘటనల గురించి తెలుపుతూ బాధ పడ్డారు.ఇక ఈ షో ఆదివారం ప్రారంభం కానుంది.