సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్.. అఖిల్ ఏజెంట్ షూటింగ్ వాయిదా?

ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా అఖిల్ సినిమా షూటింగ్ కోసం హంగేరీ ప్రాంతానికి వెళ్లి వచ్చారు.

ఈ క్రమంలోనే ఈయన ఇక్కడికి వెళ్లి వచ్చినప్పటినుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఈయనకు కరోనా పాజిటివ్ రాగానే వెంటనే కుటుంబ సభ్యులందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా అందరికీ కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం క్వారంటైన్ లో ఉన్నారు.

ఇకపోతే సురేందర్ రెడ్డి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఏజెంట్ చిత్రం తెరకెక్కుతోంది.ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ సన్నివేశాల షూటింగ్ నిమిత్తం హంగేరి ఈ ప్రాంతానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే ఈయన కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా వేశారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

Advertisement

ఇక ఈయన కరోనా బారిన పడటంతో కరోనా నుంచి కోలుకున్న అనంతరం తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.ఇక అఖిల్ విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న అఖిల్ ఏజెంట్ ఈ సినిమాపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు