ఘోరమైన రోడ్డు ప్రమాదం.. మిస్ సౌత్ ఇండియా మరణం?

ఏదైనా పని నిమిత్తం ఎక్కడికైనా బయటకు వెళ్తే వారు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకాలు పూర్తిగా కరువైపోయాయి.

ఈ క్రమంలోనే బయటకు వెళ్ళిన మనుషులు ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన కంగారుగా ఉంటుంది.

ఇలా సరదాగా బయటకు వెళ్లి వస్తానని చెప్పిన ఎంతోమంది ఇక ఎప్పటికీ తిరిగిరాని అనంత లోకాలకు వెళ్ళిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.అచ్చం ఇలాంటి ఘోరమైన ఘటన కేరళలోని ఎర్నాకులం బైపాస్ లో చోటుచేసుకుంది.

మిస్ కేరళ 2019, మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్స్ సొంతం చేసుకున్న అంజనా షాజన్ నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఎర్నాకులం బైపాస్ రోడ్డులోని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అంజనా అక్కడికక్కడే మృతి చెందారు.

అంజనా తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో వీరు ఒక ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

ఈ ప్రమాదంలో అంజనాతో పాటు మిస్ కేరళ 2019 రన్నర్ గా నిలిచిన అన్సీ కబీర్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలతో ఉండగా వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం వీరి పరిస్థితి కూడా ఎంతో విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ ప్రమాదం ఎలా జరిగింది?వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాల గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు