భారీ ధరకు 'అఖండ' నైజాం హక్కులు దక్కించుకున్న దిల్ రాజు!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈయన గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో వెనుకబడి పోతున్నాడు.

ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చూస్తుంటే ఈ సినిమాతో బాలయ్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అటు బోయపాటి శ్రీను కూడా ప్లాపులతో సతమత మవుతున్నాడు.

అందుకే ఈ సినిమాతో ఇద్దరు మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.

కరోనా వల్ల ఆలస్యం లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

Advertisement

ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కూడా కొట్టేసారు.ఇక ఈ సినిమా దీపావళి కి రిలీజ్ అవుతుందని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయినట్టు తెలుస్తుంది.ఈ సినిమా నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించు కున్నారని తెలుస్తుంది.

దిల్ రాజు ఈ సినిమా నైజాం రైట్స్ ను 19 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడట.ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ కూడా ధీమాగా ఉన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు