జై జగన్ నినాదాలతో మారుమ్రోగిన ప్రాంగణం.. మంచు విష్ణు గెలుపుతో?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు తన ప్యానెల్ కు సంబంధించిన ఎక్కువమంది సభ్యులను గెలిపించుకున్న సంగతి తెలిసిందే.

మంచు విష్ణు గెలిచిన తర్వాత ఆ ప్రాంగణంలో జై జగన్ అంటూ నినాదాలు మారుమ్రోగాయి.

వైసీపీ ప్రత్యక్షంగా అటు ప్రకాష్ రాజ్ కు, ఇటు మంచు విష్ణుకు మద్దతు ఇవ్వలేదు.అయితే మంచు విష్ణు సీఎం జగన్ కు బంధువు అనే సంగతి తెలిసిందే.మంచు విష్ణు గెలుపుతో వైసీపీలో సైతం జోష్ పెరగడం గమనార్హం.2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మోహన్ బాబు ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే.మంచు విష్ణు గెలవడం ద్వారా చిత్రపరిశ్రమలో తమకు పట్టు ఉందని వైసీపీ ప్రూవ్ చేసుకుంది.

వైసీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతుండటం గమనార్హం.జగన్ తో కలిసి విష్ణు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ఏపీలో టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు ఎంతో కాన్ఫిడెన్స్ తో ఎన్నికల్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటానని భావించిన ప్రకాష్ రాజ్ కు మాత్రం ఎన్నికల ఫలితాలు భారీ షాకిచ్చాయి.ఎన్నికల ఫలితాల తర్వాత మంచు విష్ణు మాట్లాడుతూ మనమంతా ఒకే ఫ్యామిలీ అని తెలిపారు.

Advertisement

ప్రకాష్ రాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకూడదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించినందుకు పలువురు సినీ ప్రముఖులు విష్ణుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు