ఔను.. పోకిరికి తగ్గదు అంటున్న మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో మహేష్ బాబు లుక్ చాలా విభిన్నంగా ఉందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.

సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు రావడంతో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

కీర్తి సురేష్‌ నటిస్తున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో మరో పోకిరి అవ్వడం ఖాయం అంటూ ఇటీవలే దర్శకుడు పరశురామ్‌ చెప్పుకొచ్చాడు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకున్న పోకిరి రేంజ్ లో సర్కారు వారి పాట ఉంటుందని చెప్పడంతో అంచనాలు పీక్స్‌ కు చేరాయి.

ఆ అంచనాలను మరింత పెంచే విధంగా తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు కూడా అదే వ్యాఖ్యలను చేయడంతో అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి.మహేష్‌ బాబు బిగ్‌ సి మొబైల్‌ స్టోర్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఓకే చెప్పాడు.

Advertisement

బిగ్ సి ని ప్రమోట్ చేయడం కోసం మహేష్ బాబు భారీ పారితోషికంను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మహేష్ బాబు బిగ్ సి ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకున్న సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఆ సమయంలో మహేష్‌ బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.సర్కారు వారి పాట సినిమాను ఇటీవల ఒకరు పోరికితో పోల్చుతున్నారు.

ఆ రేంజ్ సినిమా మీకు అంటున్నారు.దీనిపై మీ అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో ఔను.ఖచ్చితంగా పోరికి రేంజ్ లోనే సర్కారు వారి పాట ఉంటుంది.పోకిరికి తగ్గకుండా ఉంటుందని వారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటూ మహేష్ బాబు స్పష్టత ఇచ్చాడు.

ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా టీజర్ కు పిచ్చ క్రేజ్ దక్కింది.సినిమా ఏ రేంజ్ లో అంచనాలను కలిగి ఉందో దాంతో వెళ్లడయ్యింది.తమన్‌ నుండి వచ్చిన పాటలు కూడా ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతాయి అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తుందని అంతా నమ్ముతున్నారు.

Advertisement

తాజా వార్తలు