ఎన్టీఆర్ ' ఎవరు మీలో కోటిశ్వరులు'కు గెస్ట్ గా రాజమౌళి?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "RRR" సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బుల్లితెరపై "ఎవరు మీలో కోటీశ్వరులు" కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా వెళ్తున్నారంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రాజమౌళి "RRR" సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నారు.ఈ పనుల నిమిత్తం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగుపెట్టారు.

ఈ విధంగా అన్నపూర్ణ స్టూడియోలోకి రాజమౌళి రావడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ క్రమంలోనే రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్తున్నటువంటి ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఫోటో వైరల్ గా మారి పలు అనుమానాలకు కారణం అవుతుంది.రాజమౌళి తన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం అక్కడికి వెళ్లారా లేక అన్నపూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న రియాలిటీ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ జరుగుతుంది.ఈ షోలో ముఖ్యఅతిథిగా జక్కన్న పాల్గొనబోతున్నారా అనేది తెలియడం లేదు.

అదే విధంగా ఈ ఫోటోలో ఎన్టీఆర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో మాట్లాడుతూ కనిపించారు.మరి రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెట్టడానికి గల కారణం ఏమిటనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు