మెగాస్టార్.. కె.ఎస్ రవీంద్ర మూవీ క్రేజీ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి కాగానే ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.అందులో ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరోకటి కె.

ఎస్ రవీద్రా డైరక్షన్ లో సినిమా.ఈ రెండు సినిమాలు ఒకే సారి సెట్స్ మీదకు వెళ్తాయని అంటున్నారు.లూసిఫర్ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక కె.ఎస్ రవీంద్రా సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్.బానీ చెప్పిన లైన్ నచ్చి వెంటనే ఓకే చెప్పిన చిరు స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక చిన్న చిన్న మార్పులు చేసి ఫైనల్ చేశారట.

Advertisement

బాబీ డైరక్షన్ లో సినిమాలో చిరు ఒక్కరు కాదు ఇద్దరుగా నటిస్తారని టాక్.ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో దుమ్ముదులిపేస్తారని తెలుస్తుంది.

అంతేకాదు ఒకటి క్లాస్ మరొకటి మాస్ యాంగిల్ లో ఉంటుందని అంటున్నారు.ఆల్రెడీ చిరు తన 150 సినిమాల కెరియర్ లో డ్యుయల్ రోల్స్ చాలా చేశాడు.

మరోసారి ఈ సినిమాతో మెప్పించాలని చూస్తున్నారు.ఆచార్యతో చరణ్ తో కలిసి నటిస్తున్న చిరు కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమాకు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ లో కూడా చిరు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు