తెలుగులో ఆఫర్ల కోసం బాగానే ట్రై చేస్తున్న యంగ్ బ్యూటీ.. కానీ...

తెలుగులో 2018వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ నటి మరియు దర్శకురాలు "మంజుల ఘట్టమనేని" దర్శకత్వం వహించిన "మనసుకు నచ్చింది" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ "అమైరా దస్తూర్" గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలోనే అయినప్పటికీ అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది.

కానీ బాలీవుడ్ లో సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమని పక్కన పెట్టింది.అయితే బాలీవుడ్ లో ప్రస్థానం, మేడ్ ఇన్ చైనా, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.

దీంతో "అమైరా దస్తూర్" పారితోషకం పరంగా బాగానే సంతృప్తి చెందినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి మాత్రం సరైన అవకాశం రాకపోవడంతో కలత చెందుతోంది.దీంతో ఈ అమ్మడు తన సినీ కెరీర్ బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే బాగుంటుందని అంతేకాకుండా సౌత్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకి మంచి డిమాండ్ ఉంటుందని దాంతో ప్రస్తుతం అమైరా దస్తూర్ టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.

అంతేకాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే బోల్డ్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడని ఆ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపింది.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అమైరా దస్తూర్ తమిళంలో "కాదలై తేదీ నిత్యా నంద" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో కూడా "సత్యనారాయణ్ కి కథ" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.కాగా ఇటీవలే తమిళంలో ప్రముఖ దర్శకుడు "ఆర్ వి భరతన్" తెరకెక్కిస్తున్న "భగీర" అనే చిత్రం లో హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రంలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు "ప్రభు దేవా" హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు