చేవెళ్ళలో ప్రారంభం కానున్న సలార్ సెకండ్ షెడ్యూల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్ లు చేస్తున్నాడు.

రెండు భిన్నమైన నేపధ్యం ఉన్న కథలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

అందులో ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ ఒకటి కాగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఒకటి.ఆది పురుష్ ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ కాగా, సలార్ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కథాంశం.

ఒక సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపిస్తూ ఉండగా మరో సినిమాలో మాఫియా డాన్ గా పూర్తి కాంట్రాస్ట్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు.భిన్న నేపధ్యం ఉన్న సినిమాలు అయినా రెండు సినిమాలు ఏక కాలంలో చేస్తూ ఉండటం సాహసమనే చెప్పాలి.

ప్రస్తుతం ఆది పురుష్ సినిమా షూటింగ్ ముంబైలో గ్రీన్ మ్యాట్ స్టూడియోలో జరుగుతుంది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే త్వరలో ప్రారంభమయ్యే సలార్ మూవీ సెకండ్ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు.

Advertisement

ఇప్పటికే రామగుండంలో సలార్ ఫస్ట్ షెడ్యూల్ ని ప్రశాంత్ నీల్ పూర్తి చేశాడు.ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం శంషాబాద్, చేవెళ్ళ ప్రాంతాలలో ప్రత్యేకంగా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

మాఫియా బ్యాక్ డ్రాప్ కావడంతో ఆ వాతావరణం ఎలివేట్ అయ్యే విధంగా కాన్సెప్ట్ సెట్స్ ని ప్రశాంత్ నీల్ టీమ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు బోగట్టా.త్వరలో సెకండ్ షెడ్యూల్ చేవెళ్ళలో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.

యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలని అక్కడ షూట్ చేస్తారని సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు