తెలంగాణ సీఎం కేసీఆర్ భార్య శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇతర కుటుంబ సభ్యులు నేడు, రేపు వారణాసిలో ని వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు.
ఈ నెల 30 న మహాత్మాగాంధీ వర్ధంతి ని పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలోని ప్రాంతాల్లో మటన్ , బీఫ్ దుకాణాలను మూసివేయాలని జిహెచ్ఎంసి అధికారులు ఆదేశించారు.
ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమవారపు సత్యనారాయణ బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల రోజుల పాటు పోలీసులకు సెలవులు రద్దు చేశారు.ఈ మేరకు శాంతి భద్రతల ఏడిజి రవిశంకర్ అయ్యన్నార్ అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు జనసేన, బీజేపీ నేతలు ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హారిచందన్ తో భేటీ అవుతున్నారు.
గ్రూప్ 2 సర్వీసెస్ కింద ప్రోవిజినల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన ఫిబ్రవరి 10న జరుగుతుందని ఏపీ పీయేస్సి ప్రకటించింది.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా నారాయణన్ భరత్ గుప్త ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయితీ ఎన్నికల ఓటర్ల జాబితా వ్యవహారంలో నేడు ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.దీనిపైన నేడు విచారణ జరగనుంది.
పంచాయితీ రాజ్, గ్రామీణాభవృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , కమిషనర్ గిరిజా శంకర్ వారిద్దరూ యథావిధిగా విధుల్లో కొనసాగు తారని, వారిద్దరిపై కమిషన్ జారీ చేసిన అభిశంసన తీర్మానం చెల్లదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రిపబ్లిక్ పేరైడ్ సందర్భంగా రైతులు కొంత మేర ఎర్ర కోటను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ నెల 31వరకు ఎర్రకోట ను మూసే ఉంచుతారు.
ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో క్రాంతికారి కిసాన్ యూనియన్ నాయకుడు దర్శన్ పాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు నోటీసులు జారీ చేశారు.సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయ నంది విగ్రహం తరలింపు పై విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రేషన్ డోర్ డెలివరి చేయడం పై రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆరా తీశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు భూకంపం వచ్చింది.రిక్టర్ స్కేల్ పై 2.8 గా నమోదయ్యింది.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24గంటల్లో ఏపీలో 111కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాను ఆగస్ట్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది.
కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్ శశాంక్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.అమర్ తనను లైంగికంగా వేధించాడు అని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,650 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,800 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy