బండి సంజయ్ జిల్లాల పర్యటన వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి?

బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలో అన్ని జిల్లాల పర్యటనలు చేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ బిజీబిజీగా పర్యటిస్తున్నారు.

ఇప్పుడు బండి సంజయ్ ఇంతలా జిల్లాల పర్యటనల పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా తానే స్వయంగా పర్యటిస్తూ ఆ స్థానిక విషయాన్ని రాష్ట్ర స్థాయి విషయంగా చిత్రీకరిస్తూ బీజేపీని బలోపేతం చేస్తున్నారు.కాని అసలు మనం బండి సంజయ్ జిల్లాల పర్యటనల వెనక ఆంతర్యం ఏందని గమనిస్తే ఇప్పటివరకు కార్యకర్తల నిర్మాణంపై, రాష్ట్ర స్థాయి బలోపేతంపై దృష్టి పెట్టిన బండి సంజయ్, ఇప్పుడు జిల్లాల పర్యటనలతో జిల్లాలలో ఉన్న అసంతృప్తిగా ఉన్న ఇతర పార్టీల నేతలపై బండి సంజయ్ దృష్టి పెడుతూ, స్థానికంగా బలంగా ఉన్న నేతల చేరికతో నియోజకవర్గ స్థాయిలో బీజేపీని బలపరచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

అంతేకాక స్థానికంగా ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాడుతుందని ప్రజలకు భరోసా కల్పిస్తున్న పరిస్థితి ఉంది.తద్వారా ప్రజలలో బీజేపీ పట్ల నమ్మకం కలగడమే కాకుండా, ఎన్నికల సమయంలో ఈ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా బీజేపీ వ్యూహాలు టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయనే చెప్పవచ్చు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు