ఏందిరా వదిలేస్తావా నన్ను అంటున్న సాయి పల్లవి... లవ్ స్టోరీ టీజర్

శేఖర్ కమ్ముల సినిమా అంటే టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

మామూలు సాదాసీదా కథలని తీసుకొని ఎమోషనల్ గా అందరికి కనెక్ట్ చేయడం అతని స్పెషల్.

అందుకే కమ్ముల సినిమాలలో నటించడానికి హీరోయిన్లు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అతని కథలు చాలా వరకు హీరోయిన్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి.

వారి భావోద్వేగాల్ని ఎక్కువగా టచ్ చేస్తాడు.ఈ కారణంగా మహిళలు ఎక్కువగా అతని సినిమాలని ఇష్టపడుతూ ఉంటారు.

ఆనంద్, గోదావరి, ఫిదా సినిమాలు చూస్తే హీరోయిన్ పాత్రలకి అతను ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్ధం చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ప్రస్తుతం సాయి పల్లవి, నాగ చైతన్య జోడీగా లవ్ స్టోరీ అనే సినిమాని తెరకెక్కించారు.

Advertisement

ఈ సినిమాకి సంబందించిన టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక టీజర్ చూస్తే ఒక రొటీన్ ప్రేమ కథనే శేఖర్ కమ్ముల తీసుకున్నాడని తెలుస్తుంది.ఒక విలేజ్ లో అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం.వారి ప్రేమకి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ లేచిపోయి వెళ్లిపోవడం.

ఇది కామన్ పాయింట్ అనిపించిన టీజర్ లో ఎలివేషన్ చేసిన ఎమోషనల్ డ్రామా బట్టి సినిమా మీద పాజిటివి ఫీడ్ బ్యాక్ వస్తుంది.తనకి నచ్చిన కెరియర్ ఎంచుకునే హీరో, అనుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ సాధించలేకపోతున్న అమ్మాయి మధ్యలో ప్రేమ, ఎమోషనల్ జర్నీని చూపించి.

టీజర్ లో సాయి పల్లవి ఇందిరా వదిలేస్తావా నన్ను అనే డైలాగ్ తర్వాత ఇద్దరూ ఊరి నుంచి లేచిపోవడంతో టీజర్ ఎండ్ చేశాడు.ప్రేమకథలు ఎప్పుడూ ఆశ నిరాశలల ఉయ్యాలాటలు లాంటివి అనే విషయాన్ని తెరపై తన శైలిలో హృద్యంగా ఆవిష్కరించారని టీజర్ బట్టి తెలుస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఫిదా స్టైల్ లో సాయి పల్లవికి, అలాగే చైతూకి ఈ సినిమా ఒక మెమొరబుల్ మూవీగా నిలిచే అవకాశం ఉందని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు