రీమేక్‌ల తరువాత సాలిడ్‌గా ఇస్తానంటోన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

 Chiranjeevi Plans For A Solid Movie, Chiranjeevi, Lucifer, Vedalam, Remake, Toll-TeluguStop.com

ఇక ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనే అంశం ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ తన స్పీడును చూపిస్తున్నాడు.

ఈ క్రమంలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తరువాత తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వేదాళం’ను దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలు పూర్తయిన తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని సాలిడ్ డైరెక్టర్‌తో చేయాలని చిరు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు చిరు ప్లాన్ చేస్తున్నాడు.

అయితే క్లాస్, లేదా మాస్ చిత్రాన్ని తీసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకోవాలని చిరు భావిస్తున్నాడు.దీంతో ఈ ఇద్దరు డైరెక్టర్లలో చిరు ఎవరితో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఆచార్య చిత్రంతో చిరు తన క్రేజ్‌ను మరోసారి నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరు అండ్ టీమ్ చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube