దసరా రోజు అసలు విషయం క్లారిటీ ఇవ్వనున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోయింది.

షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా చిరంజీవి ఇప్పట్లో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం లేదు.

ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఛాన్స్‌ తీసుకోవద్దు అనుకుంటున్నారు.వృద్దులు కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైధ్యులు అంటున్నారు.

అందుకే ఆరు పదుల వయసు దాటిన కారణంగా చిరంజీవి షూటింగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా ఆచార్యను పక్కకు పెట్టిన చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌ విషయంలో మాత్రం దూకుడుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటికే లూసీఫర్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన చిరంజీవి త్వరలో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.లూసీఫర్‌ చిత్రంకు సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

Advertisement

రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఆ సినిమాను చరణ్‌ మరియు ప్రముఖ నిర్మాత నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

లూసీఫర్‌ తెలుగు రీమేక్‌ గురించి దసరాకు అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.దసరా రోజున లూసీఫర్‌ చిత్రం తెలుగు రీమేక్‌ ను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.మోహన్‌లాల్‌ నటించిన లూసీఫర్‌ మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.

ఆ చిత్రంలో కీలకమైన పాత్రను మంజు వారియర్‌ పోషించింది.తెలుగు రీమేక్‌లో ఆ పాత్రను సుహాసిన పోషించే అవకాశం ఉందంటున్నారు.

దసరాకు పూర్తి వివరాలు వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు