ఆహా అంటోన్న మిల్కీ బ్యూటీ.. దేనికో తెలుసా?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.

ఆమె ఎంచుకునే కథలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుండటంతో ఈ బ్యూటీ వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.

అయితే మునుపటిలా కాకుండా సినిమాల సంఖ్యను బాగా తగ్గించేసింది ఈ బ్యూటీ.కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్స్ పయనిస్తున్న బాటలోనే తమన్నా కూడా వెళ్లేందుకు రెడీ అవుతోంది.

ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతో అమితంగా ఆకట్టుకుంటున్న ఓటీటీలలో పలువురు స్టార్స్ తమదైన రీతిలో భాగస్వాములు అవుతున్నారు.ఇందులో కొందరు వెబ్ సిరీస్‌లలో నటిస్తుంటే, మరికొందరు రియాలిటీ షోలు చేస్తున్నారు.

కాగా తమన్నా కూడా ప్రస్తుతం ఒక ఓటీటీలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.టాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటున్న ఆహా యాప్‌లో ప్రసారమయ్యే ఓ టాక్‌షోలో తమన్నా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందకు రెడీ అయ్యింది.

Advertisement

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా యాప్, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.పలు వెబ్ సిరీస్‌లతో పాటు ఇందులో ప్రసారమయ్యే కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

మరి ఈ యాప్‌లో తమన్నా ఎలాంటి టాక్‌షోతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.కాగా సినిమాల పరంగా తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సరసన హీరోయిన్‌గా సీటీమార్ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు