జనాల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటున్న వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో జనాల వీక్‌నెస్‌ను బాగా క్యాచ్‌ చేసుకుంటున్నాడు.చెత్త సినిమాలు తీసినా కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నాడు.

ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకునేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రామ్‌ గోపాల్‌ వర్మ ఈ సమయంలో డిజిటల్‌ సినిమాలపై దృష్టి పెట్టాడు.

ఇటీవలే క్లైమాక్స్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.క్లైమాక్స్‌ సినిమాను చూడాలంటే వంద రూపాయలు చెల్లించాల్సిందే అంటూ వర్మ టికెట్టు పెట్టాడు.

అయినా కూడా ఎవరు ఆగలేదు.ఏకంగా రెండున్నర లక్షల మంది ఆ సినిమాను చూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Advertisement

ఈ సంఖ్య అయిదు లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.అంటే అయిదు కోట్ల వరకు ఆ సినిమా వసూళ్లు చేయబోతుంది.

కోటి లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

ఇప్పుడు ‘నగ్నం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఆ సినిమా టికెట్టు రేటును ఏకంగా రెండు వందల రూపాయలుగా ఖరారు చేశాడు.ఆ సినిమాకు అయిదు లక్షల వ్యూస్‌ వస్తే పది కోట్ల రూపాయలు రాబోతున్నాయి.

మొత్తానికి ఈ చిత్రాలతో వర్మ కోట్లు సంపాదిస్తున్నాడు.యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఎంతో మంది పెద్ద వారు కూడా ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

వారి వీక్‌నెస్‌ను వర్మ ఇలా క్యాష్‌ చేసుకుంటున్నాడు.ఎంతైనా వర్మ తెలివి ముందు ఇతరులు దిగదుడుపే.

Advertisement

తాజా వార్తలు