యువతి జీవితాన్ని మలుపు తిప్పిన రైలుప్రయాణం.... ఇక చదవండి...

ప్రస్తుత కాలంలో మనం ప్రయాణించే సమయంలో తారసపడే వ్యక్తులు ఒక్కోసారి జీవితాన్ని నిర్ణయించేస్తుంటారు.

తాజాగా ఓ యువతి రైల్లో ప్రయాణం చేస్తుండగా తారసపడిన వ్యక్తిని నమ్మి సర్వస్వం అర్పించి గర్భందాల్చి చివరికి  న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఘటన టెక్కలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన టువంటి ప్రమీల అనే యువతి తన వ్యక్తిగత పని నిమిత్తమై విజయనగరానికి రైలులో ప్రయాణం చేస్తోంది.అయితే అదే రైలులో వెంకటేష్ అనే వ్యక్తి కూడా ప్రయాణం చేస్తున్నాడు.

అయితే వెంకటేష్ మొదటి సారి ప్రమీలని చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయాడు.దీంతో ఎలాగైనా ఆమెని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఆమెతో మాటలు కలుపుతూ చనువుగా మాట్లాడాడు.ఈ క్రమంలో తాను దిగాల్సిన   స్టేషన్ రావడంతో కావాలనే తన వద్ద ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు ప్రమీలకి కనిపించే విధంగా అక్కడే వదిలి పెట్టి వెళ్ళిపోయాడు.

Advertisement

దీంతో ప్రమీల ఐడెంటి కార్డుని వెంకటేష్ కి అప్పగించడం కోసం ఐడి కార్డు పై ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ని చూసి ఫోన్ చేసింది.ఇంక అప్పటి నుంచి వెంకటేష్ ప్రమీల నంబర్ ని సేవ్ చేసుకొని తరచు ఫోన్లో మాట్లాడుతూ ఆ మెని ప్రేమలోకి దింపాడు.

దీంతో ప్రమీల వెంకటేష్ ఉన్నటువంటి రాజమండ్రి కి వెళ్లి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించింది.అలాగే ఒకానొక క్షణంలో తన సర్వస్వాన్నీ అతడికి అర్పించింది.దీంతో ఆమె గర్భం దాల్చింది.

దీంతో భయపడిన టువంటి ప్రమీల వెంటనే తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంకటేష్ ని కోరింది.చేసేదేమీలేక వెంకటేష్ దగ్గరలో ఉన్నటువంటి చర్చికి వెళ్లి ప్రమీలని పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం ఇద్దరూ కలిసి రాజమండ్రిలో కొద్దిరోజులు కాపురం కూడా చేశారు.అయితే ఏమైందో ఏమో గాని ఈ మధ్యకాలంలో వెంకటేష్ ప్రమీల తో తరచూ గొడవ పడుతూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి అబార్షన్ చేయించాలని నిత్యం వేధి స్తున్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయినప్పటికీ తన కడుపులోని బిడ్డ కి అన్యాయం చేయకూడదనుకుంటూ వెంకటేష్ వేధింపుల్ని ప్రమీల భరిస్తూనే వస్తోంది.తన మాటలని ప్రమీల పట్టించుకోకపోవడంతో ఇటీవల కాలంలో వెంకటేష్ ఇంటికి రావడం మానేశాడు.

Advertisement

దీంతో ఈ విషయాన్ని గ్రహించిన టువంటి ప్రమీల తనకు న్యాయం చేయాలంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.

తాజా వార్తలు