ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తు్న్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుని సాంగ్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ కన్ఫం చేశారు చిత్ర యూనిట్.

సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ తాజాగా చేసింది.సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 5వ తేదీన సాయంత్రం 5.04 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ వేడుకకు ప్రేక్షకులు, మహేష్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరవుతారని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ వేడుకును సూపర్ సక్సెస్ చయాలంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియలో చర్చించుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Advertisement

మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు