మణిరత్నం పాన్ ఇండియా మూవీ షూటింగ్ స్టార్ట్

స్టార్ దర్శకుడు మణిరత్నం చాలా కాలంగా ఓ భారీ బడ్జెట్ సినిమాకి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.

హిస్టోరికల్ డ్రామాగా పోన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.

దాని కోసం ముందుగా చాలా మంది పెద్ద స్టార్ లని మణిరత్నం సంప్రదించారు.సూపర్ స్టార్ మహేశ్ బుని కూడా ఈ సినిమా కోసం మణిరత్నం సంప్రదించారని టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మొదలైనట్లు తెలుస్తుంది.స్టార్ కాస్టింగ్ అయిన విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, అమితాబచ్చన్ వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను నిర్మాతలు థాయ్ ల్యాండ్ లో ప్లాన్ చేశారని తెలుస్తుంది.షూటింగ్ ఏర్పాట్లు కోసం మణిరత్నం టీమ్ వారం రోజుల క్రితమే థాయ్ ల్యాండ్ కు బయలుదేరి వెళ్లిందట.

Advertisement

దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తుంది.ఇక నటీనటులు కూడా షూటింగ్ లొకేషన్ కి వెళ్లిపోయారని సమాచారం.

ఇక ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలెట్టారని తెలుస్తుంది.కల్కి కృష్ణమూర్తి రచించిన పోన్నియన్ సెల్వన్ అనే తమిళ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో మణిరత్నం తెలియజేసారు.దీంతో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా రకెక్కిస్తున్నారని, వంద కోట్లకి పైగా బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

మద్రాస్ టాకీస్, సన్ పిక్చర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు