దిశ ఘటన మరువక ముందే మరో ఘటన,యూపీ లో

ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

దిశ ఘటన నిందితులకు ఉరిశిక్ష సరియని త్వరితంగా వారికి ఉరిశిక్ష విధించాలి అంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతిఒక్కరూ పోరాడుతున్నారు.

ఒకపక్క దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు నెలకొంటున్న ఈ సమయంలోనే మరో దిశ లాంటి ఘటన చోటుచేసుకుంది.అత్యాచార ఘటన లో జైలు కు వెళ్లిన ఒక అత్యాచార నిందితుడు ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యి ఆ బాధితురాలి కి నిప్పు పెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

యూపీ లోని ఉన్నావ్ జిల్లా లో గురువారం ఉదయం ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే.

ఈ ఏడాది మార్చిలో 23 ఏళ్ల యువతి పై ఇద్దరు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు.ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాలను ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగడం తో ఆమె పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్నీ తెలిపింది.

Advertisement

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితుల్లో ఒకరిని కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు.మరొకరు పరారీలోనే ఉన్నాడు.

అయితే జైలుకెళ్లిన నిందితుడు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు.అయితే ఆ యువతి పై పగ పెంచుకున్న ఆ నిందితుడు ఈ రోజు కేసు విచారణ జరగనుండగా కోర్టుకు వెళుతున్న బాధితురాలిని కొందరి దుండగుల సాయం తో అడ్డుకొని కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తుంది.

దీనితో బాధితురాలు 80 శాతం మేరకు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరోపక్క ఈ ఘటన లో పాల్గొన్న వారిలో ముగ్గురి ని అధికారులు అదుపులోకి తీసుకోగా,మరొకరు పరారీ లో ఉన్నట్లు తెలుస్తుంది.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళల పై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఎంత మాత్రం ఆగడం లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

రోజూ కూడా ఎదో ఒక ఘటన తో మహిళల మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు