అర్ధరాత్రి ఆగంతకుడు ! ప్రణయ్ ఇంటివద్ద కలకలం

ప్రణయ్- అమృత ప్రేమ వ్యవహారంలో ప్రియుడు ప్రణయ్ ని నరికి చంపించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రణయ్ మామ మారుతీరావు , కరీం, శ్రావణ్‌కుమార్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ను ప్రయోగించారు.

వారు ఇప్పుడు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్న సంగతి తేలింది.

తాజాగా.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రణయ్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.ఆదివారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా శనివారం ఉదయం సమయంలో ప్రణయ్ ఇంటి ఆవరణలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కలియతిరిగిన విషయాన్ని గుర్తించామని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు.

ఆ వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నాడని.అప్పుడే అటుగా పోలీసులు రావడంతో పారిపోయాడంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.అసలు ఆగంతకుడు ఏ ఉద్దేశంతో అర్ధరాత్రివేళ ఆ ఇంటివద్ద సంచరించినట్టు .? దీనివెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు