ఆఫరేషన్ ‘గరుడ’ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాటకాలాడుతున్నారని, సినిమా అవకాశాలు లేకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న శివాజీని ముందు పెట్టుకుని చంద్రబాబు ఈ నాటకాన్ని ప్రారంభించారని హీరో శివాజీని ఉద్దేశించి సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు, అడ్రస్లేని శివాజీతో కలసి డ్రామా ఆడుతున్నారని, ఆయనేదో కాలజ్ఞానిలాగా చెప్పారంటూ, దాన్ని ఇప్పుడు నమ్ముతున్నానంటూ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.ముందుగానే ఒక స్క్రిప్టు రాయించి, దాన్ని శివాజీతో చెప్పించి, వెనుకనుంచి నడిపిస్తున్నది చంద్రబాబా? లోకేషా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే, అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ అంటున్నారని రోజా వ్యాఖ్యానించారు.