వారెవ్వా ! నాయకుల 'చిత్ర' విచిత్రాలు చూడండయ్యా !

తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో నాయకులూ ప్రచారానికి దిగిపోయారు.మారు మూల పల్లెలకు కూడా వెళ్ళిపోయి .

 Telangana Election Campaining Diffrent Veriyations On Leders-TeluguStop.com

వరసలు కలిపేస్తూ … దండాలు పెట్టేస్తున్నారు.అంతేనా … జనాలు సీరియస్ గా ఏదైనా పనిలో నిమగ్నం అయితే… వీరు కూడా ఆ పని చేసేస్తూ .ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విధంగానే…

మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లిలో ఓ ఇంటి ముందు మహిళ బియ్యం కడుగుతుండగా.అటుగా ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ గౌడ్‌ చూశారు.అంతే.

వెంటనే ఆమె వద్ద గిన్నె తీసుకుని స్వయంగా బియ్యం కడిగారు.అక్కడే ఓ వృద్ధుడు ఉప్మా తింటుండగా ప్లేటు తీసుకుని తానే తినిపించారు.

ఓ కొత్త ఇంటి వద్ద పునాది తవ్వారు.తాపీ పట్టి సిమెంటు కూడా వేశారు.

ఇలా అన్ని పనులు చేసేస్తూ … వారిని ఆకట్టుకున్నారు.ఆ ఎన్నికల తంతు కాస్తా పూర్తయిపోతే ఇక కంటికి కనిపిస్తారా ఈ నాయకులు .?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube