తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో నాయకులూ ప్రచారానికి దిగిపోయారు.మారు మూల పల్లెలకు కూడా వెళ్ళిపోయి .
వరసలు కలిపేస్తూ … దండాలు పెట్టేస్తున్నారు.అంతేనా … జనాలు సీరియస్ గా ఏదైనా పనిలో నిమగ్నం అయితే… వీరు కూడా ఆ పని చేసేస్తూ .ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విధంగానే…
మహబూబ్నగర్లోని అప్పన్నపల్లిలో ఓ ఇంటి ముందు మహిళ బియ్యం కడుగుతుండగా.అటుగా ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ చూశారు.అంతే.
వెంటనే ఆమె వద్ద గిన్నె తీసుకుని స్వయంగా బియ్యం కడిగారు.అక్కడే ఓ వృద్ధుడు ఉప్మా తింటుండగా ప్లేటు తీసుకుని తానే తినిపించారు.
ఓ కొత్త ఇంటి వద్ద పునాది తవ్వారు.తాపీ పట్టి సిమెంటు కూడా వేశారు.
ఇలా అన్ని పనులు చేసేస్తూ … వారిని ఆకట్టుకున్నారు.ఆ ఎన్నికల తంతు కాస్తా పూర్తయిపోతే ఇక కంటికి కనిపిస్తారా ఈ నాయకులు .?
.