పోలీసులు ముద్రగడ దీక్షలో వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఆం్రధ్రపదేశ్ ముఖ్యమం్రతి దీక్షకు రాజకీయాల్ని ఆపాదించి సమస్యను పక్కదారి పట్టించి, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే , అయితే అరెస్టులు చేస్తున్న తీరు ఏకపక్షంగా ఉన్నాయని.ఈ కారణంగానే అంతా ఆందోళన చెందుతున్న విషయం ప్రభుత్వం గుర్తించాలని, తుని ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు
సామాజిక సమస్యల పరిష్కారంలో సున్నితంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ పరిణితి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించడం వల్లనే సమస్యలొస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
ముద్రగడ ప్రశాంతంగా దీక్ష చేస్తంటుఏ, అక్రమంగా అరెస్టు చేసారని అన్నారు చిరంజీవి.
.






