నాకు నెలల నిండక ముందే అబార్షన్ చేశారంటున్న టాలీవుడ్ నటుడు

టాలీవుడ్ సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి అంటే తెలియని వారుండరు.

అయితే పృద్వి సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అందిస్తున్నాడు.

అయితే ఇటీవల కాలంలో పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి వైయస్ జగన్మోహన్ రెడ్డి పృథ్వికి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే.అయితే అనుకోని విధంగా పృథ్వి ఫోన్లో ఎస్విబిసి లో పనిచేసేటువంటి ఓ మహిళ ఉద్యోగితో మాట్లాడిన సంభాషణలలు బయటికి రావడంతో పృధ్వి ని చైర్మన్ పదవి నుంచి తప్పించారు.

ఈ విషయంపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తాజాగా మరో సారి స్పందించాడు.ఇందులో భాగంగా గా తాను అంటే గిట్టని కొందరు కావాలని పథకం ప్రకారం తనను ఇరికించారని అన్నారు.

అంతేగాక ఎస్విబిసిలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరి కట్టే పనిలో తాను ఉండగా కొందరు ఇలాంటి తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు.దీంతో సాధారణంగా నెలలు నిండకుండా తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను ఐదు నెలలకే అబార్షన్ చేసి తీసేసినట్లు తనని కూడా పదవిలో చేరిన 5 నెలలకే తీసేశారని అన్నారు.

Advertisement

అయినప్పటికీ తనకు ఏమి బాధ లేదని కచ్చితంగా తొందర్లోనే తాను నిర్దోషిని అని నిరూపించుకొని మళ్లీ ఎస్వీబీసీ చైర్మన్ పదవి పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే పదవి పోయిన తర్వాత తన జీవితంలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.ఇన్ని రోజులు పదవి మరియు చేతిలో సినిమాలతో బాగా రాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తన వద్దకు వచ్చే వారని, ఇప్పుడు పదవి పోయిన తర్వాత కనీసం తన వైపు చూసే వాళ్ళు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు