కాపులకి పవన్ కళ్యాణ్ తో చెక్ పెట్టిన చంద్రబాబు ?

ముల్లుని ముల్లుతోనే తీసేయాలి అనేది ఒక సామెత దాన్ని రాజకీయ నాయకులు ఫాలో అయినట్టు ఎవ్వరూ ఫాలో అవ్వలేదు.

చంద్రబాబు గారు ప్రస్తుతం సాగుతున్న కాపు గర్జన గొడవల్లో ఇలాంటి తెలివిగల పంథా తోనే విషయాన్ని సాల్వ్ చేసే దిశగా వెళుతున్నారు అని తెలుస్తోంది.

మాజీ కాంగ్రెస్ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులకి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూ ఉన్న తరుణం లో చంద్రబాబు సర్కార్ కి ఇది సంకటంగా మారింది.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ముందున్న ఆప్షన్‌ ఒకటే.

కాపులకి రిజర్వేషన్‌ని అమలు చేయాలి.కానీ, ఆ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటన్నది అందరికీ తెల్సిన విషయమే.

Advertisement

అందుకే, వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలి.అందుకే, టీడీపీలోని కాపు నేతలకు పనిచెప్పారు.

అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌నీ రంగంలోకి దించారు.కాపు రిజర్వేషన్‌ ఉద్యమానికీ, తెలంగాణ ఉద్యమానికీ లింకు పెట్టలేంగానీ, తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.

తెలంగాణ శక్తులన్నిటినీ ఏకం చేయగలిగారు.

పార్టీల పరంగా విభేదాలే తప్ప, తెలంగాణలో అప్పట్లో ఎవరూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

కొన్ని సందర్భాల్లో పార్టీలకతీతంగా నేతలంతా ఒక్కటయ్యారు కూడా.అలా తెలంగాణ ఉద్యమం లక్ష్యాన్ని ముద్దాడింది.

Advertisement

ఇక్కడ చంద్రబాబు వ్యూహాలు బెడిసికొట్టాయి.తెలంగాణకు మద్దతిచ్చినా, తెలంగాణలో టీడీపీ అడ్రస్‌ గల్లంతయ్యింది.

ఇప్పుడు ఏపీ లో కాపు సామాజిక వర్గం వారు అందరూ ఒక్కతాటి పైకి రావాల్సిన తరుణం లో వారికి చెక్ పెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు.

తాజా వార్తలు