ఎన్టీఆర్ అంటే మహేష్ కి ఎందుకంత భయం ?

మహేష్ బాబు సినిమాలకి రిలీజ్ డేట్ తంటాలు ఎప్పుడు ఉండేవే.సినిమాలు త్వరగా పూర్తి చేసే అలవాటు మహేష్ కి ముందు నుంచి లేదు.

అందుకే తన తరువాత వచ్చిన ఎన్టీఆర్ ఇప్పటికి 26 సినిమాలు పూర్తి చేసి 27వ సినిమాని సిద్ధం చేస్తోంటే, మహేష్ మాత్రం తన 23వ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు.ఎప్పుడో ఏడాది క్రితం మొదలుపెట్టిన స్పైడర్ ఇంకా పూర్తవలేదు.

ఎప్పుడు అవుతుందో కరెక్టుగా ఎవరు చెప్పలేకపోతున్నారు.సినిమా షూట్ కొంచమే మిగిలి ఉన్నా, గ్రాఫిక్స్ వర్క్ నచ్చినట్లు వచ్చేదాకా విడుదల వద్దు అంటూ మురుగదాస్ కూర్చున్నాడట.

స్పైడర్ టీమ్ ఇలాంటి అయోమయంలో ఉంది కాబట్టి, సెప్టెంబరు చివరి వారంలో సినిమా రావడం ఇంకా అనుమానమే కాబట్టి ఎన్టీఆర్ జై లవ కుశ విడుదల తేదిని ప్రకటించేసాడు.మరోవైపు మహేష్ ఇంకా విడుదల తేది ఫిక్స్ చేసుకోలేదు.

Advertisement

సెప్టెంబర్ 22 అంటున్నారు లేదా సెప్టెంబరు 27 అంటున్నారు.ఇంకా సినిమా షూటింగ్ పూర్తవాలి, తెలుగు - తమిళ వెర్షన్స్ యొక్క పోస్ట్ ప్రోడక్షన్ పూర్తవాలి, ఆ తరువాత VFX పనుల పూర్తవాలి.

ఒకటి కాదు, రెండు సినిమాలు పూర్తి చేయాలి మహేష్ - మురుగదాస్.అందుకే స్పైడర్ దసరా రేసు నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.ఒకటి, సినిమాని హడావుడిగా చుట్టేసి పెట్టన బడ్జెట్ కి అన్యాయం చేయాలని లేదు.

రెండు, ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి లాభాలు రావాలంటే సోలోగా రావడమే కరెక్టు.ఇప్పుడు సినిమా వాయిదా వేస్తే ఎన్టిఆర్ కి భయపడ్టారు అన్నా, అలా కాదు పంపిణీదారులు, నిర్మాతల పట్ల బాధ్యతగా ఉన్నారు అన్నా, సినిమా బ్లాక్ బస్టర్ అవడమే మహేష్ - మురుగదాస్ కి కావాల్సింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

చూద్దాం మరి, స్పైడర్ బాహుబలి తరువాత దక్షిణాది సినిమా ఖ్యాతిని పెంచే సినిమా అవుతుందో లేదో.

Advertisement

తాజా వార్తలు