దువ్వాడ జ‌గ‌న్నాథం టీజ‌ర్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ డిజ్‌లైక్స్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఉన్న గ్యాప్ తెలిసిందే.బ‌న్నీ గ‌తేడాది న‌టించిన స‌రైనోడు సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యాడు.

ఆడియో ఫంక్ష‌న్‌లో బ‌న్నీ మాట్లాడుతుండ‌గా ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌వ‌న్ గురించి మాట్లాడాల‌ని కేక‌లు వేశారు.బ‌న్నీ కాస్త సీరియ‌స్‌గా వారిపై చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని ఫైర్ అయ్యాడు.

త‌ర్వాత బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ప‌దే ప‌దే టార్గెట్ అయ్యాడు.త‌ర్వాత కూడా ఒక‌టి రెండు ఫంక్ష‌న్ల‌లో బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్ విష‌యంలో అదే మొండిగా వ్య‌వ‌హ‌రించినా చివ‌ర‌కు దిగి వ‌చ్చి బ‌ల‌వంతంగా అయినా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

ఇక ఇటీవ‌ల బ‌న్నీ మెగా, ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో సంబంధం లేకుండా త‌న‌కంటూ స‌ప‌రేట్‌గా ఫ్యాన్స్ మీటింగులు పెట్టుకుంటున్నాడు.కొద్ది రోజుల క్రితం ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో సైతం బ‌న్నీని చుట్టుముట్టిన ప‌వ‌న్ అభిమానులు ప‌వ‌ర్‌స్టార్ అనాల‌ని చుట్టుముట్టి నానా ర‌చ్చ ర‌చ్చ చేశారు.

Advertisement

అక్క‌డ కుర్చీలు సైతం విర‌గ్గొట్టారు.తాజాగా ఈ రోజు రిలీజ్ అయిన బ‌న్నీ దువ్వాడ జ‌గ‌న్నాథం టీజ‌ర్ విష‌యంలో కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆ టీజ‌ర్‌కు డిజ్‌లైక్‌లు కొట్టాల‌ని సోష‌ల్ మీడియాలో యాంటీగా ప్ర‌చారం చేస్తున్నారు.

టీజ‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో గంట‌లోనే లైక్‌ల‌కు పోటీగా డిజ్‌లైక్‌లు వ‌చ్చాయి.లైకులు ఎక్కువుగా ఉంటోన్న డిజ్‌లైకులు కూడా పెరుగుతున్నాయి.

తొలి గంట‌లో టీజ‌ర్‌కు 60 వేల వ్యూస్ వ‌చ్చాయి.ఇక తొలి గంట‌లో 15 వేల లైకులు ఉంటే డిజ్‌లైకులు కూడా 10 వేల వ‌ర‌కు వ‌చ్చాయి.

త‌ర్వాత ఇవి 22 వేల లైకులు ఉంటే, డిజ్‌లైకులు కూడా 13 వేల వ‌ర‌కు వెళ్లాయి.ఓ వైపు మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్ టీజ‌ర్‌కు యాంటీగా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా యాంటీ ప్ర‌చారం చేస్తున్నారు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు