నోరు విప్పిన లక్ష్మీ పార్వతి

ఎపీకీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వై కా పా అధినేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో ప్రతి రోజు నగరి ఎమ్మెల్యే రోజా నోరు నొప్పి పుట్టే విధంగా మాట్లాడుతోంది.

ముఖ్యమంత్రి చంద్ర బాబుపై ఘాటైన విమర్శలు చేస్తున్నది.

అయితే ఈ రోజు ఆ పని నందమూరి లక్ష్మీ పార్వతి చేశారు.ఆమె బాబుపై విమర్శలు చేశారు.

హోదా కోసం జగన్ సాగిస్తున్న పోరాటాన్ని బలహీనం చేయడానికే చంద్రబాబు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసును దీక్ష శిబిరం వద్దకు పంపారని అన్నారు.జగన్ ఆరోగ్యం పై ప్రభుత్వమే మెడికల్ బులిటన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సొంత పార్టీ పెట్టి రాజకీయంగా విఫలమైన లక్ష్మీ పార్వతి ఉనికి కోసం జగన్ పార్టీలో చేరారు.అందులో ఆమెకు ఏ పదవీ లేదు.

Advertisement

జగన్ ఆందోళనలు చేసినప్పుడు ఆయన పక్కన ఉంటున్నారు.ఆమెకు రాజకీయ జీవితం లేదు.

ఇక ముందు ఉంటుందనే నమ్మకం లేదు.బాబుకు వ్యతిరేకంగా పని చేయడమే ఆమె కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు