కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం జరుగుతోంది.ఈ క్రమంలో 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,923.22 కోట్లను జమ చేయనున్నారు.
ఈ మేరకు తొలి విడతలో రూ.7,500 చొప్పున సీఎం జగన్ జమ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు.
రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్న ఆయన వారు ఇబ్బంది పడొద్దనే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు.రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు ఇచ్చామన్నారు.ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ.1965 కోట్లు చెల్లించామని చెప్పారు.విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటున్నామని వెల్లడించారు.