తెలంగాణ సీఎం కేసీఆర్‎పై వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్‎టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.మహబూబాబాద్ లో కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.

 Ys Sharmila Criticizes Telangana Cm Kcr-TeluguStop.com

అక్కర్లేని కాళేశ్వరం విషయంలో మొండిగా ముందుకు వెళ్లి, కట్టిన మూడు సంవత్సరాలకే ముంచాడన్న ఆమె అందినకాడికి కమీషన్లు దోచుకున్నారని ట్వీట్టర్ వేదికగా విమర్శించారు.ప్రజలు అభిప్రాయాలు గెలవాలట.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలట.నీ ఏలుబడిలో ఏనాడైనా ప్రజలను గౌరవించావా.? ప్రజాస్వామ్యవాదులను ఆదరించావా అని ప్రశ్నించారు.కనీసం జర్నలిస్టులకైనా గౌరవం ఇచ్చావా అని నిలదీసిన షర్మిల గడీ దాటి నీ అడుగు బయటపడితే అక్రమ అరెస్టులు… నీ నోరు విప్పితే దొంగ హామీలు అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణలో దొరల పాలన సాగిస్తూ తాలిబన్ల రాజ్యంగా మార్చారని మండిపడ్డారు.కేసీఆర్ నియంత నిర్ణయాల కారణంగా ప్రజలే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube